కడప జిల్లా రైల్వేకోడూరు వద్ద షిర్డీ ఎక్స్ప్రెస్కు ఘోర ప్రమాదం తప్పింది. తిరుపతి- షిర్డీ ఎక్స్ప్రెస్ రైలులోని ఇంజిన్ వెనుక ఉన్న జనరల్ బోగీ పట్టాలు తప్పింది. దీంతో అప్రమత్తమైన స్టేషన్ అధికారులు రైలును నిలిపివేశారు. తిరుపతి నుండి షిర్డీ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.