తిరుచానూరు అమ్మవారికి తిరుమల శ్రీవారి సారె...

Tirumala: స్వామివారి పాదాల వద్ద సారేకు ప్రత్యేక పూజలు

Update: 2022-11-28 06:59 GMT

కార్తీక బ్రహోత్సవాలు ముగింపు ఘట్టం సందర్భంగా.. తిరుమల నుండి తిరుచనూరు పద్మావతి అమ్మవారికి సారె

Tirumala: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుమల శ్రీవారు సారెను పంపించారు. తిరుచానూరులో జరుగుతున్న అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ముగింపు ఘట్టం పంచమి తీర్థం సందర్భంగా.. పసుపు-కుంకమ, చందనం, పట్టుచీర పెట్టి గర్భాలయంలో స్వామివారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఊరేగింపుగా కాలినడకన తిరుచానూరుకి తీసుకెళ్లారు. ఈ సారె ఊరేగింపులో టీటీడీ ఈవో, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. కాలిబాట గుండా తిరుపతికి తీసుకొచ్చిన సారెను అలిపిరి పాదాల మండపం వద్ద నుండి ఏనుగుపై ఊరేగింపుగా తిరుచానూరు తీసుకెళ్తారు. అనంతరం పుష్కరిణిలో చక్రస్నానం కార్యక్రమం జరగనుంది.

Tags:    

Similar News