Sangam Dairy: సంగం డెయిరీ సర్వర్లు హ్యాక్

Update: 2021-05-07 15:45 GMT

Sangam Dairy:

Sangam Dairy: సంగం డెయిరీ కీలక సర్వర్లు హ్యాకింగ్ కు గురయినట్లు IT విభాగం గుర్తించింది. రోజువారీ కార్యకలాపాల డేటా హ్యాకింగ్‌కు గురైందని ఐటీ వింగ్ ఉద్యోగులు పసిగట్టారు. దీనిపై డెయిరీ ఐటీ వింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తక్షణమే పోలీసుల సోదాలు నిలిపివేయాలని సంగం సిబ్బంది డిమాండ్ చేశారు.

ఈ సమయంలో సంస్థ ఉద్యోగులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కోర్టు ఆర్డర్స్ రాక ముందే సర్వర్లను తరలించే ప్రయత్నాలు చేస్తున్నారని యాజమాన్యం ఆరోపించింది. సంస్థ సర్వర్ రూమ్ వద్దకు ఏసీబీ అధికారులతో పాటు పోలీసులు కూడా చేరుకున్నారు. సర్వర్లను తరలించే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే తమకు కోర్టు నుంచి ఎలాంటి లిఖిత పూర్వక ఆదేశాలు రాలేదని పోలీసులు పేర్కొంటున్నారు. మరోవైపు సంగం డైయిరీ వద్దకు మీడియాకు అనుమతిని నిరాకరించారు. ప్రస్తుతం డైయిరీ తమ ఆధీనంలో ఉందని, మీడియా వాళ్లు ఇక్కడికి రావడానికి వీల్లేదని, వెళ్లిపోవాలని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

Tags:    

Similar News