RRR: రాజ్ నాథ్ తో రఘురామ భేటీ..కేపీ రెడ్డిపై ఫిర్యాదు

Update: 2021-05-30 12:59 GMT

Raghu Rama Krishnam Raju  File Photo

RRR: వైసీపీ రెబ‌ల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను క‌ల‌వ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కుదారి తీసింది. ఇటీవల తాను చికిత్స పొందిన సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి రిజిస్ట్రార్ కేపీ రెడ్డిపై రఘురామ రక్షణ మంత్రి రాజ్ నాథ్ కు ఫిర్యాదు చేశారు. తనను ఆర్మీ ఆసుపత్రి నుంచి త్వరగా డిశ్చార్జి చేసేందుకు వైద్యులపై కేపీ రెడ్డి ఒత్తిడి తెచ్చారని రఘురామ ఆరోపించారు. ఈ మేరకు రాజ్ నాథ్ కు మూడు పేజీల లేఖను సమర్పించారు.

రక్షణ శాఖ మంత్రిగా కేపీ రెడ్డిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని రాజ్ నాథ్ ను కోరారు. రఘురామ విజ్ఞప్తిపై స్పందించిన రాజ్ నాథ్... విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పినట్టు తెలుస్తోంది. కేపీ రెడ్డి, గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి, టీటీడీ ఏఈవో ధర్మారెడ్డి తనను ఏపీ సీఐడీకి అప్పగించేందుకు కుట్ర పన్నారని లేఖలో పేర్కొన్నారు. సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో మఫ్టీ పోలీసులు మకాం వేసేందుకు కేపీ రెడ్డి సహకరించారని ఆరోపించారు. ఈ క్రమంలో 15 మంది ఏపీ పోలీసుల మెస్ బిల్లులను కూడా రఘురామ తన లేఖకు జతచేసి రాజ్ నాథ్ కు అందజేశారు. 

Tags:    

Similar News