రాజధానిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన పీటర్ కమిటీ..30వేల కోట్ల మేర దుబారా జరిగిందన్న కమిటీ
రాజదాని నిర్మాణంపై పీటర్ కమిటి ప్రభుత్వానికినివేదికను అందజేసింది. రాజదాని నిర్మాణం కోసం అవసరానికి మించిన వ్యయం చేశారని కమిటీ పేర్కొంది. రాజదానిలో ప్రతి ప్రాజెక్టును పున:సమీక్షించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. 30వేల కోట్ల మేర దుబారా జరిగిందన్న కమిటీ విభజనతో పోలిస్తే, టీడీపీ పాలనలోనే ఎక్కువ నష్టం జరిగిందని తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మానాలు చేపట్టారని 75శాతం పనులు జరిగిన నిర్మాణాలపై ప్రభుత్వానిదే నిర్ణయమని పీటర్ కమిటీ వెల్లడించింది.