లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి చిత్తూరులో కరోనా పూజలు

Update: 2020-04-22 04:43 GMT

భక్తులు లాక్‌డౌన్‌ నిబంధనలు తుంగలో తొక్కారు. దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ చిత్తూరు జిల్లా కొండసముద్రం గ్రామంలో స్థానికులు కరోనా రావొద్దంటూ గంగమ్మ తల్లికి పూజలు చేశారు. గుంపులు గుంపులుగా బయటకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాళ్లపై బొమ్మలు చిత్రీకరించి పూజలు చేశారు. గ్రామంలోకి వైరస్ రావొద్దంటూ మొక్కుకున్నారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో చిత్తూరు జిల్లాను రెడ్‌జోన్‌గా ప్రకటించారు. అయితే ఏ ఒక్కరికీ మాస్క్‌లు లేవు. మాస్క్‌లు ధరించి.. సామాజిక దూరం పాటిస్తే.. కరోనా దరిచేరదని ప్రభుత్వాలు చెబుతుంటే వాటిని పట్టించుకోలేదు. 


Tags:    

Similar News