Somu Veerraju: వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది
Somu Veerraju: ఒక్క బీజేపీకే ఓట్లు అడిగే హక్కు ఉంది
Somu Veerraju: వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది
Somu Veerraju: ఏపీలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని అన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన బీజేపీ అభ్యర్థి నగరూరు రాఘవేంద్రను గెలిపించాలని ఓటర్లను కోరారు. వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు. రాయలసీమ ప్రాంతంలో జాతీయ రహదారులు, ఎయిర్పోర్టు, రైల్వేలను బీజేపీ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందని, ఒక్క బీజేపీ పార్టీకి మాత్రమే ఓట్లు అడిగే హక్కు ఉందని అన్నారు సోము వీర్రాజు.