నేటి నుంచి ఉమ్మడి గోదావరి జిల్లాల ముఖ్య నేతలతో పవన్ భేటీలు
Pawan Kalyan: పవన్ కల్యాణ్ భీమవరం పర్యటనకు ప్రభుత్వం హెలికాప్టర్.. అనుమతి నిరాకరించడంతో మంగళగిరిలోనే సమావేశాలు
Pawan Kalyan: నేటి నుంచి ఉమ్మడి గోదావరి జిల్లాల ముఖ్య నేతలతో జనసేనాని పవన్ భేటీ కానున్నారు. పవన్ కల్యాణ్ భీమవరం పర్యటనకు ప్రభుత్వం హెలికాప్టర్..అనుమతి నిరాకరించడంతో మంగళగిరిలోనే సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయా జిల్లాల నేతలను మంగళగిరి రావాలని పార్టీ ఆదేశాలు జారీ చేసింది. భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో చేపట్టాల్సిన సమావేశాలను మంగళగిరి ఆఫీస్లోనే నిర్వహిస్తున్నారు. మూడ్రోజులపాటు సమావేశాల అనంతరం జనసేన రూట్మ్యాప్ ఖరారు చేయనుంది. అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక పైనా పవన్ కసరత్తు చేయనున్నారు.