వైసీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం : పవన్ కల్యాణ్

Update: 2020-12-28 11:03 GMT

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై జనసేనాని పవన్ కల్యాణ్ ఘాటు వ్యా‌ఖ్యలు చేశారు. భయపెట్టి పరిపాలన చేయాలనుకుంటే ఇక్కడ భయపడేవాళ్లు ఎవరూ లేరన్నారు. జనసేన ఎవరికీ భయపడదనే సంగతి జగన్ గుర్తుంచుకోవాలన్నారు. తాను సినిమాలు చేస్తూ రాజకీయాలు చేయకూడదంటూ వైసీపీ లీడర్లు విమర్శిస్తున్నారని, మరి, జగన్ వ్యాపారాలు చేస్తూ రాజకీయాలు చేయడం లేదా? అంటూ ప్రశ్నించారు.

పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 35వేలు చొప్పున పరిహారం ఇవ్వాల్సిందేనని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. తక్షణ సాయంగా ఎకరాకు పది వేల రూపాయల చొప్పున అందించాలన్నారు. రైతుల కోసం తాము రోడ్లపైకి వస్తే వైసీపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. వైసీపీ లీడర్లు నోటికొచ్చినట్లు మాట్లాడితే తాము కూడా అదే పద్ధతిలో సమాధానం చెప్పాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. వచ్చే శాసనసభ సమావేశాల్లోపు రైతులకు పరిహారం అందించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని పవన్ హెచ్చరించారు. 

Tags:    

Similar News