Pattabhi: రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి పట్టాభి విడుదల

Pattabhi: గత నెల 22న గన్నవరం కేసులో అరెస్ట్‌ అయిన పట్టాభి

Update: 2023-03-04 10:09 GMT

Pattabhi: రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి పట్టాభి విడుదల

Pattabhi: రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి విడుదలయ్యారు. గన్నవరం కేసుల్లో అరెస్ట్‌ అయిన పట్టాభిని గత నెల 22 నుంచి రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌లో ఉంచారు. నిన్న పట్టాభి సహా 10మంది టీడీపీ నాయకులకు బెయిల్‌ మంజూరు కావడంతో నేడు విడుదలయ్యారు. ఈ సందర్భంగా రాజమండ్రి సెంట్రల్‌ జైలు వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

సెంట్రల్‌ జైలు వద్ద విడుదలైన నేతలకు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సహా పలువురు నేతలు ఘన స్వాగతం పలికారు. బీసీ వర్గాలకు మద్దతు తెలిపేందుకే గన్నవరం వెళ్లానన్నారు పట్టాభి. పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తే అక్రమంగా కేసులో ఇరికించారని తెలిపారు. తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‌లో అర్ధరాత్రి కరెంట్‌ తీసేసి తనను కొట్టారని ఆరోపించారు పట్టాభి. పట్టాభిని హత్య చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి.


Full View


Tags:    

Similar News