Pattabhi Ram: కాసేపట్లో విజయవాడ కోర్టుకు టీడీపీ నేత పట్టాభి

*తోట్లవల్లూరు పీఎస్‌ నుంచి విజయవాడకు పట్టాభి తరలింపు *తోట్లవల్లూరు పీఎస్‌ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు కఠినతరం

Update: 2021-10-21 07:00 GMT

పట్టాభి రామ్ (ఫైల్ ఫోటో)

Pattabhi Ram: కాసేపట్లో విజయవాడ కోర్టులో టీడీపీ నేత పట్టాభిని హాజరుపర్చనున్నారు పోలీసులు. తోట్లవల్లూరు పోలీస్‌ స్టేషన్‌ నుంచి పట్టాభిరామ్ ని విజయవాడకు తరలిస్తున్నారు. ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపర్చనున్నారు. దీంతో తోట్లవల్లూరు పీఎస్‌ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలను కఠినతరం చేశారు. ఊర్లోకి వెళ్లే రోడ్లను సైతం మూసివేశారు. స్థానికులను తప్ప ఇతరులను గ్రామంలోకి అనుమతించడంలేదు పోలీసులు.

Tags:    

Similar News