అమరావతి రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వం మరో హైపవర్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఉద్యోగులు, మంత్రులు, ఐఏఎస్ అధికారులతో ఏర్పాటయ్యే ఈ కమిటీ మూడు వారాల్లో నివేదిక అందజేయనుంది. ఉద్యోగుల బదలాయింపు, కార్యాలయాల తరలింపుపై ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. కేబినెట్ సమావేశం సందర్భంగా రాజధానిపై మంత్రుల నుంచి సీఎం జగన్ సలహాలు, సూచనలు కోరారు. కమిటీ వేయాలంటూ కొందరు మంత్రులు సూచించగా ఎలాంటి కమిటీ అవసరం లేదని మీ మాటే మా మాట అంటూ మరికొందరు అన్నట్టు సమాచారం.