విజయనగరం జిల్లాలో అమ్మఒడి పథకం ఎంట్రీకి సాంకేతిక చిక్కులు ఎదురౌతున్నాయి. సర్వర్ సమస్య వెంటాడుతోంది. నేటితో గడువు పూర్తవుతున్నా విద్యార్ధుల ఎంట్రీ పూర్తికాని పరిస్థితి నెలకొంది. దీంతో గడువును పెంచి సాంకేతిక సమస్యలను సరిచెయ్యాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోరుతున్నారు. ఒకపక్క ఇంటర్ విద్యార్థులకు మాత్రం మంగళవారంతోనే ముగియగా, స్కూళ్లకు మాత్రం గడువు నేటితో పూర్తవుతోంది. ఇంతతక్కువ సమయంలో నమోదు పూర్తి చేయలేమని అధికారులు సైతం చేతులెత్తేస్తున్నారు.