Andhra Pradesh: ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు

Andhra Pradesh: 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఒక్కపూట తరగతులు

Update: 2021-03-22 08:20 GMT

స్కూల్ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: ఏపీలో ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ఎండలు, కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఏప్రిల్ నుంచి ఉదయం 7 గంటల 45 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు క్లాసులు జరగనున్నాయి. ఇక పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు అమలు చేయడంపై అధికారులకు ఆదేశాలిచ్చారు మంత్రి ఆదిమూలపు సురేశ్. కొవిడ్ పరీక్షల నిర్వహణ, మాస్క్‌లు, భౌతిక దూరం విషయాలపై దృష్టి సారించాలన్నారు.

Tags:    

Similar News