రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు.. సీఎం జగన్‌పై నారా లోకేష్ ఘాటు విమర్శలు

పంచాయతీ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే టీడీపీపై దాడులు-లోకేష్‌

Update: 2021-02-02 10:05 GMT

రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు.. సీఎం జగన్‌పై నారా లోకేష్ ఘాటు విమర్శలు

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై మరోసారి నారా లోకేష్ ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిమ్మాడలో అచ్చెన్నాయుడు ఇంటిపై కత్తులు, రాడ్స్‌తో దాడికి వెళ్లిన వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్, అతని అనుచరులపై ఎందుకు కేసు నమోదు చేయలేదని నారా లోకేష్ ప్రశ్నించారు.

Tags:    

Similar News