ఐటీ దాడులను వైసీపీ రాజకీయం చేస్తుందని టీడీపీ నేతలు ఆరోపించారు. అక్రమాస్తుల కేసుల నుంచి తప్పించుకోడానికే ఎదుటివాళ్లపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ పై ఐటీ దాడులతో టీడీపీకి సంబంధం లేదంటున్నారు. వైసీపీ నేతలు రాజకీయ అపరిచుతులు అంటూ టీడీపీ నేత నారా లోకేష్ ట్వీట్ చేశారు. చంద్రబాబు హయంలో యవుతకు తొమ్మిది లక్షల 56,263 ఉద్యోగాలు వచ్చాయని అసెంబ్లీ సాక్షిగా జగన్ నిజాన్ని ఒప్పుకున్నారని లోకేష్ ట్వీట్ చేశారు.
రావాలి జగన్ కావాలి జగన్ అని జైలు పిలుస్తుంది అన్న భయం జగన్ గారిని వెంటాడుతోంది. అందుకే ఇన్ఫ్రా కంపెనీల్లో జరిగిన ఐటీ రైడ్స్ కి టీడీపీ కి ముడి పెట్టాలని తెగ తాపత్రయపడుతున్నారు అని లోకేష్ ట్వీట్ చేశారు.
చంద్రబాబు గారి హయాంలో ఒక్క ఉద్యోగం కూడా రాలేదు అంటూ అసత్యాల యాత్ర చేసిన @ysjagan గారు ఇప్పుడు ఒక్కొక్కటిగా నిజాలు బయటపెడుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో బాబు గారి హయాంలో రాష్ట్ర యువతకి 9,56,263 ఉద్యోగాలు వచ్చాయని అసెంబ్లీ సాక్షిగా నిజాన్ని ఒప్పుకున్నారు. (1/4) pic.twitter.com/MW0Oa4k4oL
— Lokesh Nara (@naralokesh) February 14, 2020
రావాలి జగన్ కావాలి జగన్ అని జైలు పిలుస్తుంది అన్న భయం జగన్ గారిని వెంటాడుతోంది. అందుకే ఇన్ఫ్రా కంపెనీల్లో జరిగిన ఐటీ రైడ్స్ కి టిడిపి కి ముడి పెట్టాలని తెగ తాపత్రయపడుతున్నారు. (3/4)
— Lokesh Nara (@naralokesh) February 14, 2020