కృష్ణాజిల్లా మచిలీపట్నంలో పురోహితుడి మిస్సింగ్ మిస్టరీగా మారింది. పదిరోజుల క్రితం ఇంటి నుంచి బయటకి వెళ్లి కనబడకుండా పోయాడు. కుటుంబసభ్యులు రాజబాబుకి ఫోన్ చేయగా మొబైల్ స్విచ్చాఫ్ కావడంతో కంగారుపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాజబాబు అర్చకత్వంతో పాటు స్దానికంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. ఒంటి మీద బంగారం, ద్విచక్రవాహనంలో డబ్బు ఉందని రాజబాబు భార్య చెబుతోంది.మిస్సింగ్ అయి పదిరోజులు దాటుతున్నా రాజబాబు ఆచూకి లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి వెతుకుతున్నారు.