తిరుపతిలో కలకలం రేపుతున్న మిస్సింగ్ కేసులు

Tirupati: వేర్వేరు ఘటనల్లో మూడు మిస్సింగ్ కేసులు నమోదు

Update: 2022-06-02 06:55 GMT

తిరుపతిలో కలకలం రేపుతున్న మిస్సింగ్ కేసులు

Tirupati: ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుపతిలో మిస్సింగ్ కేసులు కలకలం రేపుతున్నారు. తిరుపతిలో ఒకే రోజు మూడు మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. వేర్వేరు ఘటనల్లో వేర్వేరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. తిరుపతి చెన్నారెడ్డి కాలనీకి చెందిన ఓ బాలుడు.. ఇంటి నుంచి ఐస్ క్రీం కోసం బయటకు వెళ్లాడు. ఆ తరువాత కనిపించకుండా పోయాడు. చుట్టుపక్కల వెతికిన కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సత్యనారాయణ పురానికి చెందిన మోనిషా ఉదయం గుడికి వెళ్లింది. ఆ తరువాత తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. నగరికి చెందిన వివేక్ తిరుపతిలో స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు వెళ్లాడు. అయితే పది రోజులగా జాక తేలియకపోవడంతో ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తంగా మూడు కేసులను నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News