Srikakulam: శ్రీకాకుళంలో గాంధీ ఆలయం

Srikakulam: స్వాతంత్ర్య యోధుల త్యాగాన్ని చాటేలా స్పూర్తి వనం

Update: 2022-01-30 11:05 GMT

శ్రీకాకుళంలో గాంధీ ఆలయం

Srikakulam: జాతిపిత గాంధీ వర్ధంతి నాడు శ్రీకాకుళం జిల్లాలో గాంధీ మందిరం ఏర్పాటైంది. బాపూజీతో పాటు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను చాటేలా స్పూర్తి వన నిర్మాణానికి సిక్కోలు వేదికైంది. బాపూజీ మందిరంతోపాటు ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధులు విగ్రహాలతో ఈ సృతివనం ఎంతో ముచ్చటగా ఉందన్నారు స్పీకర్ తమ్మినేని సీతారం. ఇటువంటి మందిరం మన దేశంలోనే మొదటిదన్నారు స్పీకర్ తమ్మినేని. అలాగే యువత గాంధీ అడుగుజాడల్లో నడవాలన్నారు. దేశం కోసం గాంధీతో పాటు చాలా మంది చేసిన సేవలు ఈ స్పూర్తి వనం ద్వారా తెలుస్తాయని మాజీ మంత్రి ధర్మన ప్రసాదరావు అన్నారు.

Tags:    

Similar News