Kurnool: నేషనల్ లా యూనివర్సిటీకి సీఎం జగన్ భూమి పూజ
Kurnool: అభివృద్ధి వికేంద్రీకరణ మన ప్రభుత్వ లక్ష్యం-
Kurnool: కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటించారు. 29వ నేషనల్ లా యూనివర్శిటీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ యూనివర్శిటీ కోసం ప్రభుత్వం 150 ఎకరాల భూమి కేటాయించగా.. నిర్మాణ పనులకు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు. ఇక్కడే హైకోర్టు భవనం కూడా నిర్మాణం జరుగుతుందని అన్నారు. లా యూనివర్శిటీ ప్రారంభం కానున్న నేపథ్యంలో కర్నూలు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్. అభివృద్ధి వికేంద్రీకరణ తమ ప్రభుత్వ లక్ష్యమని.. ఆ దిశగానే అడుగులు వేస్తున్నామని అన్నారు.