కల్కీ ఆశ్రమంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. నాలుగు బృందాలుగా వీడిన అధికారులు చిత్తూరు జిల్లా వరదయ్యపాలెంలో ఉన్న కల్కీ ఆశ్రమంలోని కార్యాలయాలు, చెన్నైలోని కార్యాలయాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ తెల్లవారుజాము నుంచి జరుగుతున్న సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. కల్కి ట్రస్ట్ నిర్వాహకుడు లోకేష్ దాసజీని అధికారులు విచారిస్తున్నారు. ట్రస్ట్కు సంబంధించిన ఏకం, జీ.సీ 1, జీ.సీ 2, జీ.సి 3 ఆశ్రమాలలో దర్యాప్తు జరుగుతోంది.