ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సతీష్ చంద్రను నియమించింది. సురేంద్రబాబుకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఇసుక అక్రమ రవాణా నిరోధ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. జి.ఎస్వీ ప్రసాద్ను సాధారణ పరిపాలనశాఖలో ఎస్పీఏఎఫ్ చీఫ్ త్రిపాఠిని డీజీపికి రిపోర్ట్ చేయమని ఆదేశించింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి కన్నబాబుకు గ్రామ, వార్డు వాలంటీర్స్తో పాటు గ్రామ సచివాలయ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది.