శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 6 గంటల సమయం

Srisailam: క్యూలైన్లలో బారులు తీరిన భక్తులు

Update: 2024-01-29 03:23 GMT

శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 6 గంటల సమయం

Srisailam: శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. శివుడికి సోమవారం ప్రీతికరం కావడంతో మల్లన్న క్షేత్రంలో భక్తులు పోటెత్తారు. భక్తులు వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు. స్వామి అమ్మవారి దర్శనం కోసం దాదాపు ఆరు గంటల సమయం పడుతోంది.

మరోవైపు స్వామి అమ్మవార్ల రుద్రాభిషేకం, కుంకుమార్చన, తదితర అభిషేకాలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు. అయితే ఆలయంలో భక్తుల రద్దీ దృష్ట్యా క్యూలైన్లలో ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లు, కంపార్టుమెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, మంచినీరు అందిస్తున్నారు.

Tags:    

Similar News