Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

Tirumala: ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం

Update: 2024-03-03 02:34 GMT

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 29 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పట్టనుంది. ఇక నిన్న శ్రీవారిని 70వేల, 442 మంది భక్తులు దర్శించుకున్నారు.

మరో వైపు వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలలో ప్రత్యేక దర్శనం 300 రూపాయల టికెట్లను పెంచనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. వీఐపీ, శ్రీవాణి, టూరిజం, వర్చువల్ సేవల టికెట్లను తగ్గించి ఎస్‌ఎస్డీ, ఎస్‌ఈడీ టికెట్ల కోటా పెంచుతామన్నారు. ఎన్నికల కోడ రానున్న నేపథ్యంలో రికమండేషన్ లెటర్లపై వీఐపీ బ్రేక్ దర్శనాల కోటా ఉండదని స్పష్టం చేశారు. 

Tags:    

Similar News