Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

Tirumala: రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం

Update: 2024-02-16 08:15 GMT

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

Tirumala: రథ సప్తమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌ నిండి వెలుపల క్యూలో వేచి ఉన్నారు. వైకుంఠ క్యూలో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా.. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది. కాగా నిన్న 45 వేల 825 మంది భక్తులు ‌శ్రీవారిని దర్శించుకున్నారు. 21 వేల 380 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీకి 4 కోట్లకు పైగా ఆదాయం చేకూరింది.

Tags:    

Similar News