ఎన్ని చట్టాలు చేసినా.. ఎన్కౌంటర్లు జరిపినా కామందులను అవేవి భయపెట్టడం లేదు. ఏదో ఒకచోట మహిళలు, బాలికలపై అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఏపీ అసెంబ్లీలో 'దిశ' బిల్లు ఆమోదం పొంది కొద్ది గంటలు కూడా గడవక ముందే గుంటూరులో అమానుష ఘటన జరిగింది. గుంటూరులో రామిరెడ్డి నగర్లో మైనర్ బాలికపై అత్యాచారం చేశాడో ఇంటర్ విద్యార్థి. ఇంటిపై పోర్షన్లో ఉంటున్న అతను ఆడుకుంటున్న పాపపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక అనారోగ్యానికి గురికావడంతో ఆరా తీయగా విషయం వెలుగులోకి వచ్చింది. నగరంపాలెం పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసింది.