అచ్చెన్నాయుడు ముందస్తు బెయిల్పై నేడు విచారణ
Atchannaidu: స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏ38గా చేర్చిన సీఐడీ
Atchannaidu: అచ్చెన్నాయుడు ముందస్తు బెయిల్పై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అచ్చెన్నాయుడిని సీఐడీ ఏ38గా చేర్చింది. దీంతో ముందస్తు బెయిల్ కోసం అచ్చెన్నాయుడు హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఈ కేసులో చంద్రబాబు అరెస్టు అయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో 53 రోజులపాటు ఉన్నారు. అక్టోబర్ నెల ఆఖరిలో చంద్రబాబుకు బెయిల్ వచ్చింది. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో తాజాగా ఈ కేసులో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరు చేర్చడం సంచలనంగా మారింది.