ఘోర రోడ్డు ప్రమాదంలో 5 గురు మృత్యువాత పడ్డారు. గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రాథమికంగా అందిన వివరాల ప్రకారం.. తిరుపతి నుంచి కారులో 11 మంది పాలకొల్లు వెళుతున్నారు. కారు చిలకలూరిపేట లోని ఎన్నార్టీ సెంటర్ వద్ద అదుపు తప్పి, రోడ్డు పక్కన ఆగివున్న లారీని వేగంగా ఢీకొట్టింది.
దాంతో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మరణించినవారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వీరంతా పాలకొల్లు కు చెందిన వారని చెప్పారు. ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.