Giddalur: కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే

పట్టణంలోని మార్కెట్ యార్డులో శనగలు, కందుల కేంద్రాన్ని శనివారం గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు అన్నా వెంకట రాంబాబు ప్రారంభించారు.

Update: 2020-02-29 12:02 GMT
శాసనసభ్యులు అన్నా వెంకట రాంబాబు

గిద్దలూరు: పట్టణంలోని మార్కెట్ యార్డులో శనగలు, కందుల కేంద్రాన్ని శనివారం గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు అన్నా వెంకట రాంబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రైతులకు అండగా ఉండేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు.

కొనుగోలు కేంద్రంలో రైతులకు క్వింటాల్ కందులు రూ. 5,800 లు, శనగలు రూ. 4,870 లుగా గిట్టుబాటు ధర కల్పించిందని, కాబట్టి ఈ అవకాశాన్ని రాచర్ల, కొమరోలు, గిద్దలూరు మండలాలకు చెందిన రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు ఛైర్మన్ షేక్ మెహతాబ్, వైఎస్సార్ పార్టీ నాయకులు సిఎచ్ రంగారెడ్డి, కోటా నరసింహులు, ఆర్ డీ రామకృష్ణ, జనార్ధన రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News