తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Tirumala: భక్తులతో నిండిపోయిన వైకుంఠం కంపార్ట్‌మెంట్లు

Update: 2022-08-15 03:27 GMT

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సేవా సదన్ మీదుగా రింగ్ రోడ్డులోని ఆక్టోపస్ బిల్డింగ్ వరకు భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 30గంటలు,ప్రత్యేక దర్శనానికి 6గంటల సమయం పడుతోందని టీటీడీ ప్రకటించింది. నిన్న 92వేల 328మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 4కోట్ల 36లక్షల హుండీ కానుకలు లభించాయి. తిరుపతిలో వసతి ఉన్న భక్తులే తిరుమల దర్శనానికి రావాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags:    

Similar News