జగన్పై నమ్మకంతో వైసీపీలో చేరా : దేవినేని అవినాష్
ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, జగన్పై నమ్మకంతో వైసీపీలో చేరినట్లు దేవినేని అవినాష్ స్పష్టం చేశారు.
ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, జగన్పై నమ్మకంతో వైసీపీలో చేరినట్లు దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు.
టీడీపీకి తాను ఉపయోగపడ్డానని పార్టీ వల్ల తనకు ఉపయోగం లేదన్నారు. టీడీపీలో ఉండి ఎలాంటి భూకబ్జాలకు పాల్పడలేదని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించినందుకు జగన్కు ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలను కలుపుకుని ముందుకు వెళ్తానన్నారు. పార్టీలో చేరడానికి సహకరించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.