Pawan Kalyan: కోడూరులో పొలాలను పరిశీలించిన పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి రైతులకు భరోసా కల్పించారు.

Update: 2025-10-30 09:33 GMT

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి రైతులకు భరోసా కల్పించారు. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గం, కోడూరు మండలం, కృష్ణాపురం గ్రామంలో ఆయన బుధవారం పర్యటించారు.

భారీ వర్షాల ధాటికి దెబ్బతిన్న పంట పొలాలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంట నష్టాన్ని అంచనా వేస్తూ, నష్టం వివరాలను నేరుగా రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు.

తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులు తమ ఆవేదనను పవన్ కల్యాణ్‌కు వివరించారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు ధైర్యం చెబుతూ, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని వారికి హామీ ఇచ్చారు. నష్ట పరిహారం అందించే విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

Tags:    

Similar News