టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి ఆరోపణలు

తిరుమల శ్రీవారి ప్రధాన అర్చకుడిపై బీజేపీ నేత, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి ఆరోపణలు చేశారు.

Update: 2020-01-02 06:32 GMT

తిరుమల శ్రీవారి ప్రధాన అర్చకుడిపై బీజేపీ నేత, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి ఆరోపణలు చేశారు. సంప్రదాయాలకు విరుద్ధంగా.. మూలవిరాట్‌ వద్ద రమణదీక్షితులు కార్యక్రమాలు చేశాడని.. అడ్డుచెప్పిన సహచర అర్చకులతో గొడవ పడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

ఈ సంఘటనపై విచారణ చేపట్టి... శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. గతేడాది కంటే 2 లక్షల డైరీల తయారీని టీటీడీ కుదించడంతో.. భక్తులు నిరాశపడ్డారని విమర్శించారు. టీటీడీ అధికారుల నిర్లక్ష్య ధోరణిపై విచారణ చేపట్టాలన్నారు. 

Full View


Tags:    

Similar News