గుంటూరు జిల్లా నర్సరావుపేట ఎంఆర్ఓ ఆఫీస్.. అవినీతికి అడ్డాగా మారింది. అక్కడ ఏదైనా పని కావాలంటే చేతులు తడవాల్సిందే. బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే.. అధికారులకు నోట్లు ఇస్తేనే పనిజరుగుతుంది. నర్సరావుపేటకు చెందిన అంకమరావు.. నెల రోజులుగా బర్త్ సర్టిఫికెట్ కావాలని ఎంఆర్వో ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు. అయితే జూనియర్ అసిస్టెంట్ ఖాసీం మాత్రం డబ్బులు ఇస్తేనే బర్త్ సర్టిఫికెట్ ఇస్తానని డిమాండ్ చేశాడు. దీంతో అంకమరావు.. 2వేల నగదును ఇచ్చాడు. ఈ దృశ్యాలు హెచ్ఎంటీవీకి లభించాయి.