మూడు రాజధానులను స్వాగతించిన కాంగ్రెస్ పార్టీ
-కొన్ని మార్పులు చేస్తే బాగుంటుందన్న పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి
ఏపీకి మూడు రాజధానులు వస్తాయామోనని సీఎం జగన్ సూచనప్రాయంగా చేసిన ప్రకటనపై అప్పుడే స్పందనలు మొదలయ్యాయి. ఏపీకి మూడు రాజధాని ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ స్వాగతిస్తుందని పీసీసీ ఉపాధ్యాక్షుడు తెలసిరెడ్డి. అయితే కొన్ని మార్పులు చేస్తే బాగుంటుందని సూచించారు. విశాఖలో లెజిస్టేటివ్ రాజధాని అమరావతిలో ఎగ్జిక్యూటివ్ రాజధానిని ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కర్నూలులో జ్యూడిషియల్ రాజధాని ఏర్పాటు చేయడం సరైన నిర్ణయమేనన్నారు.