చిత్తూరు జిల్లాలో నాగుల పంచమి రోజున ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. భీమగనిపల్లిలోని భీమేశ్వరస్వామి ఆలయంలో నాగుపాము గుడిచుట్టు ప్రదక్షిణలు చేసింది. నంది విగ్రహం ముందు పడగవిప్పి నాట్యం చేస్తూ కనిపించింది. పామును చూసిన భక్తులు కేకేలు వేస్తున్నా గుడిచుట్టూ ప్రదక్షిణ చేస్తుండటంతో.. అంతా దేవుడి మహిమ అని చెప్పుకుంటున్నారు.