YS Rajasekhar Reddy: వైఎస్ఆ‎ర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న సీఎం జగన్

YS Rajasekhar Reddy: కడప జిల్లా ఇడుపులపాయలో సీఎం జగన్

Update: 2021-09-02 04:50 GMT

వైస్సార్ కు నివాళులు అర్పిస్తున్న సీఎం జగన్ (ఫోటో ది హన్స్ ఇండియా)

YS Rajasekhar Reddy: కడప జిల్లా ఇడుపులపాయలో మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ షర్మిల, వైఎస్ భారతి నివాళులర్పించారు. వైఎస్సార్‌ను స్మరించుకుంటూ మౌనం పాటించారు.

అంతకుముందు తన తండ్రి వర్ధంతి సందర్భంగా సీఎం జగన్ ట్వీట్ చేశారు. తండ్రి భౌతికంగా దూరమై 12 ఏళ్లయినా జనం మనిషిగా, తమ ఇంట్లోని సభ్యునిగా నేటికి జన హృదయాల్లో కొలువై ఉన్నారని ట్వీట్ లో పేర్కొన్నారు. చిరునవ్వులు చిందించే ఆయన రూపం ఆత్మీయ పలకరింపు మది మదిలోనూ అలానే నిలిచి ఉన్నాయన్నారు.. తాను వేసే ప్రతి అడుగులోనూ, చేసే ప్రతి ఆలోచనలోనూ వైఎస్సార్ స్పూర్తి ముందుండి నడిపిస్తోందని జగన్ స్పష్టం చేశారు.


Tags:    

Similar News