CM Jagan: విగ్రహాల ధ్వంసంపై మరోసారి సీఎం జగన్ ఘాటు వ్యా‌ఖ్యలు

Update: 2021-01-05 09:41 GMT

CM Jagan: ఏపీలోని ఆలయాలు, విగ్రహాల దాడిపై సీఎం జగన్‌ ఫైరయ్యారు. భయం, భక్తి లేకుండా దేవుడి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారంటూ మండిపడ్డారు. సంక్షేమ ఫలాలు అందిస్తుంటే జీర్ణించుకోలేక దొంగదెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని చూస్తున్నవారి ఆటకట్టిస్తామన్నారు ఆయన. మతాలు, కులాల మధ్య ద్వేషాలు పెంచేవారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు.

ఇకపై దేవాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేసి ర‌క్షించుకునే కార్యక్రమాలు చేపడతామన్నారు. ఇక మతసామరస్యం గురించి మాట్లాడే మాటలు పబ్లిసైజ్‌ కావాలన్నారు సీఎం జగన్‌. రాజకీయ గొరిల్లా వార్‌ఫేర్‌ను ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు సీఎం జగన్‌.

Tags:    

Similar News