Chandrababu: ఏలూరు జిల్లా పోలవరం, తూర్పు గోదావరి జిల్లా... కొవ్వూరు నియోజకవర్గాల్లో చంద్రబాబు యాత్ర
Chandrababu: రెండోరోజు రాష్ట్రానికి ఇదేం ఖర్మ యాత్రలో పాల్గొననున్న బాబు
Chandrababu: రెండో రోజు ఇదేం ఖర్మ రాష్ట్రానికి యాత్రలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఏలూరు జిల్లా పోలవరం, తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గాల్లో చంద్రబాబు యాత్ర కొనసాగుతోంది.. నరసన్నపాలెంలో బీసీ సంఘాలతో బాబు భేటీ కానున్నారు. కొయ్యలగూడెం, కేఆర్ పురం మీదుగా పోలవరానికి చంద్రబాబు చేరుకోనున్నారు. పోలవరంలో మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగసభలో బాబు మాట్లాడనున్నారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజవర్గంలో చంద్రబాబు యాత్ర ప్రవేశించనుంది. రాత్రి 8 గంటలకు కొవ్వూరు విజయ విహార్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడుతారు. రాత్రికి కొవ్వూరులోనే బస చంద్రబాబు చేయనున్నారు.