ఎన్నికలకు ముందు వైసీపీలో చేరాలని తనకు ఆహ్వానం అందిందని బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. కానీ ప్రస్తుతం అలాంటి ఆహ్వానం ఏదీ లేదని ఆమె స్పష్టం చేశారు. తన భర్త వైసీపీలో చేరే సమయంలోనే తాను బీజేపీలోనే ఉంటానని ఆయనకు తెలిపినట్లు వెల్లడించింది. అందుకు వైసీపీ నాయకులు అంగీకరించిన తర్వాతే తన భర్త ఆ పార్టీలోకి వెళ్లినట్లు ఆమె వివరించారు.