Ponnuru: జీఎస్టీపై అవగాహన సదస్సు

Update: 2020-03-14 15:15 GMT

పొన్నూరు: పట్టణంలోని లయన్స్ పాలీ సర్వీస్ సెంటర్లో జీఎస్టీలో ఏప్రిల్ నుంచి అమలు చేయబోతున్న నూతన రిటర్న్ లపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో మంగళగిరి రేంజి సెంట్రల్ టాక్స్ డిప్యూటీ కమిషనర్ వై.భాస్కరరావు ముఖ్య అతిథిగా పాల్గొని అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో తెనాలి రేంజ్ సూపరింటెండెంట్ రాజేశ్వరరావు, టాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పులిపాక ప్రసాద్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొత్తమాసు రామకృష్ణ, లయన్స్ పాలీ సర్వీస్ సెంటర్ వ్యవస్థాపకులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల సాంబశివరావు, ఆడిటర్స్ చీమకుర్తి ప్రభాకర్, ధరణికోట సురేష్, అన్నీ వర్తక సంఘాల అధ్యక్ష కార్యదర్శులతోపాటు సభ్యులు పాల్గొన్నారు.


Tags:    

Similar News