Buggana Rajendranath: గత ప్రభుత్వం వేలకోట్ల బిల్లులను పెండింగ్లో పెట్టింది
Buggana Rajendranath: టీడీపీ మద్దతు మీడియా అసత్య ప్రచారాలు చేస్తోంది
Buggana Rajendranath: గత ప్రభుత్వం వేలకోట్ల బిల్లులను పెండింగ్లో పెట్టింది
Buggana Rajendranath: టీడీపీ గద్దె దిగిపోతూ వేల కోట్ల బిల్లులను పెండింగ్లో పెట్టిందని ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడమే లక్ష్యంగా ఎల్లో మీడియా పని పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్లో వరుసగా మూడు సార్లు మొదటిస్థానంలో నిలిచినా టీడీపీ మద్దతు మీడియా మాత్రం నోరు మెదపడం లేదన్నారు. జగన్ది బిజినెస్ మెన్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.