షర్మిల పార్టీపై ఏపీ ఉప ముఖ‌్యమంత్రి కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో కొత్త నాయకత్వం కావాలన్నారు డిప్యూటీ సి.ఎం. ధర్మాన కృష్ణదాసు అన్నారు.

Update: 2021-02-10 12:22 GMT

ధర్మాన కృష్ణ దాసు ఫైల్ ఫోటో(The hans India )

The hans India

The hans India

తెలంగాణలో షర్మిలా పార్టీపై వైసీపీ నేతలు ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. జగన్ ఆంధ్రాకు మాత్రమే పరిమితం అంటూనే.. తెలంగాణలో షర్మిలా పార్టీ ఆమె వ్యక్తిగతం అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా షర్మిలా పార్టీపై ఏపీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాసు స్పందిచారు. తెలంగాణలో కొత్త నాయకత్వం కావాలన్నారు డిప్యూటీ సి.ఎం. ధర్మాన కృష్ణదాసు అన్నారు. షర్మిళ పార్టీ జగన్మోహనరెడ్డికి వ్యతిరేకం కాదు.. అనుకూలం కాదని ధర్మాన అన్నారు. సమైక్య రాష్ట్రంలో రాజశేఖరరెడ్డి అభిమానులు చాలా మంది ఉన్నారు. రాజశేఖరెడ్డి ఇప్పుడు లేని కారణంగా అక్కడ ఉన్న వారికి అండగా ఉండేందుకు షర్మిళమ్మ తెలంగాణలో పార్టీని పెడుతున్నారన్న కృష్ణదాసు జగన్మోహనరెడ్డి ఆంధ్రా వరకే పరిమితం అవుతారని స్పష్టం చేసారు.

Tags:    

Similar News