ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్షను
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు.. బోర్డు తెలిపిన షెడ్యూల్ వివరాల ప్రకారం వచ్చే సంవత్సరం మార్చ్ 4 నుంచి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రారంభం అయి 21 తో ముగుస్తుండగా , ఇక ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 5 నుంచి ప్రారభం అయి 23 న ముగుస్తాయి.. ఒకేషనల్ కోర్సులకు కూడా ఇదే షెడ్యూలు వర్తించనుంది. వెల్లడించిన తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక తెలంగాణా ఇంటర్ పరీక్షల తేదీలు ఇవే కావడం విశేషం..
ఇక ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్షను జనవరి 28న, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను జనవరి 30న నిర్వహించనున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు తెలిపింది.