AP News Today: తెలంగాణపై కృష్ణా బోర్డుకు ఏపీ జలవనరులశాఖ ఫిర్యాదు

AP News Today: విద్యుదుత్పత్తి పేరుతో కృష్ణా జలాలు వినియోగిస్తున్నారు- ఏపీ

Update: 2021-06-25 11:30 GMT

కృష్ణ రివర్ బోర్డు (ఫైల్ ఇమేజ్)

AP News Today: ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాలు మళ్లీ ముదురుతున్నాయి. కృష్ణా జలాల్లో వాటాలపై రెండు రాష్ట్రాలు పరస్పర ఆరోపణలతో కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ఇటీవల రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ఫిర్యాదులు చేయగా.. తెలంగాణ విద్యుదుత్పత్తి పేరుతో కృష్ణా జలాలను తరలించుకుపోతుందంటూ ఏపీ జలవనరుల శాఖ కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. అసలు తెలంగాణ విద్యుదుత్పత్తికి అనుమతే లేదని తెలిపింది. నిబంధనల ప్రకారం కేవలం వరదల సమయంలో మాత్రమే శ్రీశైలం, సాగర్ జలాశయాల నుంచి కృష్ణా బోర్డు అనుమతితో తీసుకోవాలని పేర్కొంది ఏపీ.

Tags:    

Similar News