ఏపీ ఐపీఎస్‌ అధికారుల సంఘానికి ఐపిఎస్ అధికారి ఎబి వెంకటేశ్వర రావు లేఖ

* రాష్ట్ర ప్రభుత్వం వేధింపులపై చర్చించేందుకు ఐపీఎస్‌ అధికారుల సంఘం జనరల్‌ బాడీ సమావేశం పెట్టాలని లేఖ

Update: 2021-01-06 08:27 GMT

ఏపీ ఐపీఎస్‌ అధికారుల సంఘానికి లేఖ రాశారు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. రాష్ట్ర ప్రభుత్వం వేధింపులపై చర్చించడానికి ఐపీఎస్‌ అధికారుల సంఘం జనరల్‌ బాడీ సమావేశం పెట్టాలని సంఘం కార్యదర్శికి లేఖ రాశారు. నెలల తరబడి నాకు పోస్టింగ్‌, జీతం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. తప్పుడు కేసులో నన్ను అరెస్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టు తనకు సమాచారం ఉందని లేఖలో తెలిపారు. జైల్లో పెట్టి తనను సస్పెండ్‌ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందంటూ రాష్ట్రశాఖతో పాటు ఐపీఎస్‌ అధికారుల కేంద్ర సంఘానికి కూడా లేఖను రాశారు ఏబీ వెంకటేశ్వరరావు.

Full View


Tags:    

Similar News