Kadapa: కడప జిల్లా ఖాజీపేటలో ఐదోతరగతి విద్యార్ధి మృతి

Kadapa: టీచర్ కొట్టడం వల్లే బాలుడు మృతిచెందాడని ఆరోపిస్తున్న తల్లిదండ్రులు

Update: 2023-07-01 11:06 GMT

Kadapa: కడప జిల్లా ఖాజీపేటలో ఐదోతరగతి విద్యార్ధి మృతి

Kadapa: కడప జిల్లా ఖాజీపేట మండలం కొత్త నెల్లూరులో ఐదోతరగతి విద్యార్ధి అనుమాస్పదంగా మృతి చెందాడు. బీరం శ్రీధర్ రెడ్డి స్కూల్‌లో సోహైల్ అనే బాలుడు ఐదో తరగతి చదువుతున్నాడు. ఉదయం కడుపు నొప్పితో బాధపడుతున్నాడని... తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యం ఫోన్ చేసి చెప్పింది. ఆస్పత్రికి తరలించేలోపే విద్యార్థి మృతి చెందాడు. అయితే టీచర్ కొట్టడం వల్లే బాలుడు మృతిచెందాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్కూల్ ఎదుట తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేస్తున్నారు.

Tags:    

Similar News