Corona Cases in Andhra Pradesh: ఏపీలో కొనసాగుతోన్న కరోనా విజృంభణ

Corona Cases in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది.

Update: 2021-04-11 12:28 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ (ఫైల్ ఫొటో)

Corona Cases in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. గడిచిన 24గంటల్లో మూడు వేల 495 మందికి కరోనా సోకింది. ఇక, అదే స్థాయిలోనూ యాక్టివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఏపీలో ప్రస్తుతం 20 వేల 954 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.

ఇక, గడిచిన 24గంటల్లో 9 మంది మృత్యువాత పడగా, మొత్తం మృతుల సంఖ్య 7300 కి చేరింది. ఆంధ్రప్రదేశ్ లోని  చిత్తూరులో అత్యధికంగా నలుగురు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లజిల్లాల్లొ ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

Tags:    

Similar News