Chittoor: ఆధారాలు లేని 14 కేజీల వెండి స్వాధీనం

Chittoor: బెంగళూరు నుంచి నెల్లూరుకు కారులో తరలిస్తున్న వెండి వస్తువులు

Update: 2024-03-26 05:33 GMT

Chittoor: ఆధారాలు లేని 14 కేజీల వెండి స్వాధీనం

Chittoor: చిత్తూరులో ఎలాంటి ఆధారాలు లేని 14 కేజీల వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున యాదమర్రి బైపాస్ రోడ్‌లో వాహనాల తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఈ తనిఖీల్లో ఓ కారులో ఆధారాలులేని 14 కిలోల వెండి వస్తువులను గుర్తించారు. బెంగళూరు నుంచి నెల్లూరుకు కారులో వెళ్తున్న ఫణీంద్ర అనే వ్యక్తి ఎలాంటి ఆధారాలు బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించి.. 14 కేజీల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎలాంటి బిల్లులు సాక్షాధారాలు లేకుండా నగదు, విలువైన బంగారు వెండి ఇతర వస్తువులను ఆభరణాలను రవాణా చేసిన కేసులు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Tags:    

Similar News