Pattabhi: టీడీపీ నేత పట్టాభికి 14 రోజుల రిమాండ్

Pattabhi: పట్టాభికి 14 రోజుల రిమాండ్ విధించిన విజయవాడ కోర్టు

Update: 2021-10-21 12:39 GMT

పట్టాభికి 14 రోజుల రిమాండ్ విధించిన విజయవాడ కోర్ట్ (ఫైల్ ఇమేజ్)

Pattabhi: సీఎం జగన్‌పై వ్యాఖ్యల కేసులో టీడీపీ నేత పట్టాభికి 14 రోజుల రిమాండ్ విధించింది విజయవాడ కోర్టు. పట్టాభిని తోట్ల వల్లూరు పీఎస్ నుంచి విజయవాడ తీసుకొచ్చిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. పట్టాభికి బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది కోరారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ పట్టాభిపై గతంలోనే అనేక కేసులు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి పట్టాభికి 14 రోజుల రిమాండ్ విధించారు. పట్టాభి బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా వేశారు. మరోవైపు పట్టాభిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేశారు. 

Tags:    

Similar News